ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 71,758 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,224 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 409, తూర్పుగోదావరి జిల్లాలో 299, పశ్చిమగోదావరిలో 252, కృష్ణాలో 222, గుంటూరులో 191 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,82,096 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 31 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపూర్ లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12630 కి పెరిగింది. గత 24 గంటల్లో 4714 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 18,27,214 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,252 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ