టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 14 వరకు నాలుగు రోజుల పాటుగా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పలు మండలాల్లో చంద్రబాబు పర్యటించి పార్టీ శ్రేణులతో, ప్రజలతో మమేకమవనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా అక్టోబర్ 11న బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు కుప్పం చేరుకోనున్నారు. కుప్పం మున్సిపాలిటీలో 11, 12 తేదీల్లో, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో 13వ తేదీన, గుడుపల్లె మండలంలో 14వ తేదీన చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానిక టీడీపీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ