దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. 5 నెలల తర్వాత దేశంలో కొత్త కోవిడ్ కేసులు 2100 దాటాయి. గత 24 గంటల్లో మొత్తం 1,42,497 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2151 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 1.51 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,47,09,676 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో ఏడు మరణాలు (మహారాష్ట్రలో 3, కర్ణాటకలో 1, కేరళలో రికాంసైల్డ్ 3) ) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,848కి పెరిగింది.
కాగా మరో 1222 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,66,925 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. మరోవైపు ప్రస్తుతం దేశంలో 11,903 (0.03%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. కాగా 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదవలేదు.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (మార్చి 29 (8am)–మార్చి 23 (8am)):
- మహారాష్ట్ర – 450
- కేరళ – 332
- గుజరాత్ – 316
- ఢిల్లీ – 214
- హిమాచల్ ప్రదేశ్ – 140.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE