దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. తాజాగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 2,202 పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 16, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,23,801 కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో 27 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,24,241 కి పెరిగింది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో 17,317 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.74 శాతం:
దేశంలో ప్రస్తుతం 17,317 (0.04%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 2,550 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,25,82,243 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. అలాగే మే 16, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 84.41 కోట్లకు (84,41,34,156) చేరుకుంది. మే 16న 2,97,242 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF