దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసులు వరుసగా ఆరోరోజూ కూడా 3 లక్షల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,57,299 కేసులు, 4194 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,89,290 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,95,525 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం వంటి 10 రాష్ట్రాల్లోనే 78.12 శాతం కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 29,23,400 (11.12%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 3,57,630 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,30,70,365 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 87.76 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.12 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు 10 నమోదైన రాష్ట్రాలివే (మే 21 8am–మే 22 8am) :
- తమిళనాడు – 36184
- కర్ణాటక – 32218
- కేరళ – 29673
- మహారాష్ట్ర – 29644
- ఆంధ్రప్రదేశ్ – 20937
- వెస్ట్ బెంగాల్ – 19847
- ఒడిశా – 12523
- ఉత్తరప్రదేశ్ – 7682
- రాజస్థాన్ – 6225
- అస్సాం – 6066
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ