దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,11,170 కరోనా పాజిటివ్ కేసులు, 4077 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,70,284 కి పెరిగింది. కాగా గత కొన్ని రోజులతో పోల్చితే రోజువారీ కరోనా కేసుల నమోదు క్రమంగా తగ్గుముఖం పడుతుంది, రికవరీలు పెరుగుతున్నాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి.
దేశంలో కరోనా రికవరీ రేటు 84.25 శాతం, మరణాల రేటు 1.09 శాతం:
ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, హర్యానా వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 36,18,458 (14.66%) చేరువైంది. మరో 3,62,437 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,07,95,335 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 84.25 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (మే 16, ఉదయం 8 గంటల వరకు):
దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 31,48,50,143
మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 2,46,84,077
కొత్తగా నమోదైన కేసులు [మే 15– మే 16 (8AM-8AM)] : 3,11,170
నమోదైన మరణాలు : 4077
రికవరీ అయిన వారి సంఖ్య : 2,07,95,335
యాక్టీవ్ కేసులు : 36,18,458
మొత్తం మరణాల సంఖ్య : 2,70,284
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ