దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. 88 రోజుల తర్వాత దేశంలో రోజువారీ కరోనా కేసులు కనిష్టానికి (53,256) చేరుకున్నాయి. వరుసగా 39 రోజూ కూడా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువుగా ఉన్నాయి. అలాగే కరోనా మరణాల్లో కూడా క్రమంగా తగ్గుదల కన్పిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 53,256 కేసులు, 1422 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,88,135 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అస్సాం, తెలంగాణ, పంజాబ్ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 7,02,887 (2.35%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 78,190 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,88,44,199 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 96.36 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.30 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (జూన్ 20 8am–జూన్ 21 8am):
- కేరళ – 11647
- మహారాష్ట్ర – 9361
- తమిళనాడు – 7817
- ఆంధ్రప్రదేశ్ – 5646
- కర్ణాటక – 4517
- ఒడిశా – 3577
- వెస్ట్ బెంగాల్ – 2184
- అస్సాం – 1775
- తెలంగాణ – 1006
- పంజాబ్ – 541
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ