దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 6 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5,439 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 30, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,44,21,162 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 30 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,27,829 కి పెరిగింది. ఇక ఆగస్టు 39, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 88.55 కోట్లకు చేరుకుంది. ఆగస్టు 29న 3,20,418 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
దేశంలో 65,732 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.66 శాతం:
దేశంలో ప్రస్తుతం 65,732 (0.15%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 22,031 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,38,25,024 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.66 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, కేరళ, హర్యానా, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY