టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సెప్టెంబర్ 3, శనివారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ/శాసనసభా పక్ష (టీఆర్ఎస్ఎల్పీ) సమావేశం జరగనుంది. ముందుగా సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశం అనంతరం, తెలంగాణ భవన్ లో సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగే టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు, తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY