తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సెప్టెంబర్ 3, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఈ కేబినేట్ సమావేశం సందర్భంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు, నిర్వహణ, తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చి 15వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆరు నెలల లోపు అనగా సెప్టెంబర్ 14వ తేదీలోపు అసెంబ్లీ మళ్లీ సమావేశం కావాల్సి ఉన్ననేపథ్యంలో శనివారం నిర్వహించే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. కాగా గత తెలంగాణ కేబినెట్ సమావేశం ఆగస్టు 11న జరగగా 10 లక్షల పెన్షన్లు మంజూరు, 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY