దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో మొత్తం 1,47,344 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 635 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.43 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,67,311 కు చేరుకుంది. అలాగే మరో 11 మరణాలు (కేరళలో 9 మరణాల సవరణతో కలిపి) నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,546 కి పెరిగింది. మరో 1,010 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,29,590 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
కాగా ప్రస్తుతం దేశంలో 7,175 (0.02%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (నవంబర్ 16 (8am)–నవంబర్ 17 (8am)):
- మహారాష్ట్ర – 156
- కేరళ – 153
- తమిళనాడు – 65
- కర్ణాటక – 60
- రాజస్థాన్ – 42
- గుజరాత్ – 25
- తెలంగాణ – 22
- ఢిల్లీ – 19
- పశ్చిమబెంగాల్ – 16
- ఉత్తర్ ప్రదేశ్ – 12.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE