దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదవడంతో డిసెంబర్ 20, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,47,46,838 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 132 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,77,554 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, జమ్మూ అండ్ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో 82267 యాక్టీవ్ కరోనా కేసులు, 572 రోజుల్లో ఇదే తక్కువ:
దేశంలో ప్రస్తుతం 82,267 (0.24%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. దీంతో 572 రోజుల కనిష్ట స్థాయికి యాక్టీవ్ కేసులు చేరుకున్నాయి. ఇక కొత్తగా 8,077 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,41,87,017 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 98.39 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.37 శాతంగా ఉంది. అలాగే డిసెంబర్ 19, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 66,51,12,580 కు చేరుకుంది. డిసెంబర్ 19న 8,77,055 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
దేశంలో 160కు పైగా ఒమిక్రాన్ కేసులు:
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 160 దాటింది. మొత్తం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా 54 ఒమిక్రాన్ కేసులు నమోదవగా, ఢిల్లీలో 24, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్ లో 17, కేరళలో 15, గుజరాత్ లో 11 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ