భారతదేశంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్ కేసులు బుధవారం అమాంతం పెరిగాయి. ఏకంగా 7 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 7,830 కొత్త కోవిడ్-19 పాజిటివ్లు నమోదయ్యాయ. తద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,000 మార్కుకు చేరుకుంది. కాగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు మొత్తం 2,14,242 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 7,830 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,47,76,002కి చేరినట్లయింది. అలాగే 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,016కి చేరుకుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 12, ఉదయం 8 గంటల వరకు):
- ఏప్రిల్ 11న నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,14,242
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 11–ఏప్రిల్ 12 (8AM-8AM)] : 7,830
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,47,76,002
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 4,692
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,42,04,771
- కరోనా రికవరీ రేటు : 98.72 శాతం
- యాక్టివ్ కేసులు : 40,215
- కొత్తగా నమోదైన మరణాలు : 11
- మొత్తం మరణాల సంఖ్య : 5,31,016
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.66 (220,66,24,326) కోట్లు పంపిణీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE