దేశంలో గత 24 గంటల్లో మొత్తం 1,65,486 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 842 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.51 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,64,810 కు చేరుకుంది. అలాగే మరో 6 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,520 కి పెరిగింది. మరో 1,271 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,21,538 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
కాగా ప్రస్తుతం దేశంలో 12,752 (0.03%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (నవంబర్ 10 (8am)–నవంబర్ 11 (8am)):
- కేరళ – 195
- మహారాష్ట్ర – 169
- కర్ణాటక – 102
- తమిళనాడు – 88
- ఢిల్లీ – 36
- గుజరాత్ – 35
- రాజస్థాన్ – 31
- తెలంగాణ – 30
- ఉత్తర్ ప్రదేశ్ – 20
- ఒడిశా – 19.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE