ట్విట్టర్ బ్లూటిక్ పెయిడ్ వెర్షన్ భారతదేశంలో అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశంలోని కొంతమంది ట్విటర్ వినియోగదారులకు ట్విట్టర్ బ్లూకు సబ్స్క్రయిబ్ చేసుకోవాల్సిందిగా మెసేజిలు వస్తున్నాయి. కాగా నెలకు రూ. 719 వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ట్విట్టర్ కొనుగోలు చేసిన అనంతరం ఎలోన్ మస్క్ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయడం తెలిసిందే. బుధవారం నుంచి అమెరికాతో, బ్రిటన్ సహా మరికొన్ని ఇతర దేశాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన బ్లూ సర్వీస్ చార్జీలు ప్రారంభమయ్యాయి. దీనికోసం అక్కడ 7.99 డాలర్లు వసూలు చేయనున్నారు. అయితే ఇది భారతదేశంలో ఇంకా పూర్తిస్థాయిలో విడుదల కానందున దేశంలోని కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతానికి ఈ మెసేజిలు కేవలం ఐ-ఫోన్ వాడేవారికి మాత్రమే వచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో భారతదేశంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం ఇండియాలో అది రూ. 719 కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE