తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కొత్తగా 7646 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 29, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 53 మంది మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2261 కి పెరిగింది.
ఇక గత 24 గంటల్లో 5926 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 3,55,618 కు చేరుకుంది. ప్రస్తుతం 77,727 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాడు 77,091 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,29,05,854 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 3,46,745 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ