దేశంలో నవంబర్ 16, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88,45,127 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గత 44 రోజులుగా దేశంలో కొత్తగా నిర్థారణ అవుతున్న కరోనా పాజిటివ్ కేసులకంటే, కరోనా నుంచి కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24 గంటల్లో కూడా 30,548 కొత్త కేసులు నమోదు కాగా, 43,851 మంది కోలుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పరీక్షలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ వ్యూహం కారణంగా సకాలంలో బాధితులను గుర్తించటం, వ్యాప్తిని అడ్డుకునే చర్యల వలన కొత్త కేసులు తగ్గుతూ వచ్చాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య తగ్గుదల బాటలో సాగుతోంది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులలో 4,65,478 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే దేశంలో కోలుకున్నవారి సంఖ్య 82,49,579 కి పెరగడంతో రికవరీ రేటు 93.27% కి చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ