భారత్, ఇంగ్లాండ్ జట్ల మూడో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ చెరో మ్యాచ్ గెలవడంతో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమమైంది. రెండో టీ20 లో ఘన విజయం సాధించిన భారత్ జట్టు మూడో టీ20 మ్యాచులో కూడా సత్తా చాటి సిరీస్లో ఆధిక్యం సాధించేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్ జట్టు కూడా బలహీనతలను సరిచేసుకుని తగిన ప్రణాళికలతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగతుంది.
మరోవైపు ఈ రోజు మ్యాచ్ తో సహా మిగిలిన రెండు టీ20 మ్యాచులు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. ముందుగా ఈ టీ20 సిరీస్ మొత్తానికి స్టేడియం సామర్థ్యంలో 50 శాతం ప్రేక్షకులను అనుమతించినట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) వెల్లడించింది. అయితే గతకొన్ని రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంతో, మిగిలిన మూడు టీ20 మ్యాచులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే ఈ మూడు మ్యాచుల కోసం టికెట్లు కోనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు వాపస్ ఇవ్వనున్నట్టు జీసీఏ సోమవారం నాడు అధికారికంగా ప్రకటించింది.
భారత్ తుది జట్టు అంచనా: కేఎల్ రాహుల్/రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్/అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్.
ఇంగ్లాండ్ తుదిజట్టు అంచనా: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ