నేడే భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్, 50 శాతం ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి

India Vs England : First T20 Match Today, Fans were Allowed for 50% Seating Capacity

భారత్, ఇంగ్లాండ్ జట్ల 5 టీ20ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ను 3-1తో ఘన విజయం సాధించిన భారత్ జట్టు టీ20ల్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇరు జట్లలోనూ హిట్టర్లు ఎక్కువగా ఉండడంతో ఈ మ్యాచ్ లు అభిమానులకు కనువిందు చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదు టీ20 లను కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ‌ స్టేడియంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటు, ఈ టీ20 సిరీస్ మొత్తానికి స్టేడియం సామర్థ్యంలో 50 శాతం ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించిన‌ట్లు గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ (జీసీఏ) వెల్ల‌డించింది.

భారత్ తుది జట్టు : కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్.

ఇంగ్లాంగ్ తుది జట్టు : జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్‌ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =