భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ చెరో రెండు మ్యాచులు గెలవడంతో ప్రస్తుతానికి సిరీస్ 2-2తో సమమైంది. నాలుగో టీ20 లో విజయం సాధించిన భారత్ జట్టు నేడు జరిగే కీలక మ్యాచులో కూడా మెరుగైన ప్రదర్శన చేసి సిరీస్ గెలిచేందుకు సిద్ధమైంది. కాగా మంచి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్ జట్టు భారత్ కు ఈ సిరీస్ లో గట్టి పోటీ ఇస్తుంది.
మరోవైపు టాస్ గెలవడంపై కూడా చర్చ నడుస్తుంది. మొదటి 3 టీ20 మ్యాచ్ల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టే విజయం సాధించగా, నాలుగో మ్యాచ్లో భారత్ టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. ఏదేమైనా ఇరుజట్ల మధ్య సిరీస్ లో విజేతను నిర్ణయించే ఈ కీలక మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
భారత్ తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్/ ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్.
ఇంగ్లాండ్ తుదిజట్టు అంచనా: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), సామ్ కుర్రాన్/మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ