దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో మార్చి 19, శనివారం మరియు మార్చి 20, ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు వెస్ట్ బెంగాల్ లోని ఖరగ్పూర్ ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. బెంగాల్ ప్రజల భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలనుకుంటున్నామని చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని విమర్శించారు. గత 70 సంవత్సరాలలో మీరు అందరికీ అవకాశాలు ఇచ్చారు, కానీ బీజేపీకి 5 సంవత్సరాలు ఇవ్వండి, 70 సంవత్సరాల సమస్యలు నుండి బెంగాల్ ను విముక్తి చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరోవైపు ఖరగ్ పూర్ సభ అనంతరం అస్సాంలోని చబువాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ