టీమిండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు 16 మంది సభ్యలతో కూడిన జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా. సిరీస్కు కెప్టెన్గా టెంబ బావుమాను ఎంపిక చేసింది. అలాగే ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న చాలా మంది దక్షిణాఫ్రికా ప్లేయర్లను జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ఒక ప్రకటనలో తెలిపింది. యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ దక్షిణాఫ్రికా తరుపున టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక వెటరన్ పేసర్ వేన్ పార్నెల్ 2017 తర్వాత మళ్ళీ టీ20ల్లో ఆడనున్నాడు. జూన్ 9 నుంచి 19 వరకు ఇండియా, సౌతాఫ్రికా మధ్య అయిదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ భారత్లోని ఐదు వేదికల్లో.. జూన్ 9న ఢిల్లీలో, 12న కటక్లో, 14న వైజాగ్లో, 17న రాజ్కోట్లో, 19న బెంగుళూరులో టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. కాగా బీసీసీఐ కూడా ఒకట్రెండు రోజుల్లో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
సౌతాఫ్రికా జట్టు
టెంబ బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ