ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2022 లో ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని తొలగిస్తునట్టు ప్రకటించారు. ముందుగా గత సంవత్సరం కరోనా పరిస్థితుల కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేసి ప్రత్యేక విధానంలో విద్యార్థులకు మార్కులను కేటాయించడంతో ఒక్క ఏడాదికే (ఈఏపీ సెట్-2021) లో 25 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపును అమలు చేస్తునట్టు తెలిపారు. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహించబడలేదని, ఇంటర్మీడియట్ ప్రదర్శన ఆధారంగా ఈఏపీ సెట్-2022 ర్యాంక్లను కేటాయించేటప్పుడు 25% గ్రూప్ సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి నివేదించింది.
మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షకు ఫీజు చెల్లించిన అభ్యర్థులందరూ 2020-21 విద్యా సంవత్సరానికి కనీస ఉత్తీర్ణత మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించామని, దీంతో ఈఏపీ సెట్-2022 లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఇవ్వడం కుదరదని, ఏడాది కూడా ఇంటర్ వెయిటేజీ తొలగింపుపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత విద్యా మండలి కోరింది. ఈ అంశాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలించిన తర్వాత, ఈఏపీ సెట్-2022 లో మొత్తం ర్యాంకింగ్ను నిర్ణయించడం కోసం ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే 100శాతం వెయిటేజీ ఇచ్చి ఫలితాలు/ర్యాంకులు ప్రకటించేందుకు ఉన్నత విద్యా మండలికి అనుమతి ఇచ్చింది. మరోవైపు ఈఏపీ సెట్-2022 లో భాగంగా జులై 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అయిదు రోజులపాటు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు, జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF