భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఇటీవల రోజుకి 70 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 34 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 76472 కేసులు, 1021మరణాలు నమోదయ్యాయి. ఆగస్టు 29, శనివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 34,63,972 కు, మరణాల సంఖ్య 62550 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 26 లక్షలు దాటింది. ఒకే రోజులో 65,050 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 26,48,998 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 76.5 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.8 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 29, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 34,63,972
- కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 28–ఆగస్టు 29 (8AM-8AM)] : 76472
- నమోదైన మరణాలు : 1021
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 26,48,998
- యాక్టీవ్ కేసులు : 7,52,424
- మొత్తం మరణాల సంఖ్య : 62,550
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu