నగరంలో యూపీకి చెందిన 10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వీళ్ళు ముఖ్యంగా బంగారం దుకాణాలను టార్గెట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్దనుంచి ఆయుధాలు, చోరీకి వాడే సామాన్లు, డీసీఎం వెహికల్, ఒక టూ వీలర్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ దొంగల ముఠా సభ్యులపై ఇప్పటికే పలు కేసులున్నాయని, నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో అంబేద్కర్ కాలనీలో షెల్టర్ తీసుకుని ఉంటున్నారని వెల్లడించారు.
ఈ గ్యాంగ్ ఇద్దరు జనసంచారం తక్కువుగా ఉన్న ప్రాంతాల్లో బంగారం దుకాణాలపై ముందుగా రెక్కీ నిర్వహిస్తారని, అనంతరం గ్యాంగ్ అంతా వెళ్లి చోరీకి పాల్పడుతారని అన్నారు. దొంగతనం చేసే సమయంలో ఆయుధాలు ఉపయోగించడంతో పాటుగా, ఎవరైనా అడ్డొస్తే చంపేందుకు కూడా వెనుకాడరని తెలిపారు. ఈ ముఠా ప్రమేయం ఉన్న పలు సంఘటనలను సీపీ వివరించారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులను సీపీ సజ్జనార్ అభినందించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu