దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 20.89 కోట్లకు చేరుకుంది. అమెరికా తర్వాత 20 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటిన రెండో దేశంగా భారత్ నిలిచింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ భాగంగా 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 29, శనివారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 20.89 కోట్లు (20,89,02,445) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరోవైపు ఇప్పటిదాకా దేశంలో 18-44 సంవత్సరాల వయస్సు కేటగిరిలో 1,67,66,581 మంది లబ్ధిదారులు మొదటి డోసు మరియు 298 మంది రెండో డోసు కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ