ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ఉత్కంఠభరిత మ్యాచులతో ఆసక్తికరంగా సాగుతుంది. కాగా గాయాలు సహా పలు కారణాల దృష్ట్యా కొందరు ఆటగాళ్లు తమ జట్లకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో కూడా ఓ మార్పు చోటుచేసుకుంది. సీఎస్కే జట్టు సభ్యుడైన న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన సీఎస్కే యొక్క మొదటి మ్యాచ్లో ఆర్మ్ స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు, దీంతో అతను మిగిలిన టోర్నమెంట్ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆడమ్ మిల్నే స్థానంలో శ్రీలంకకు చెందిన 19 ఏళ్ల యువ మీడియం పేసర్ మతీషా పతిరానాతో సీఎస్కే జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. 2020 మరియు 2022లో శ్రీలంక అండర్-19 ప్రపంచ కప్ స్క్వాడ్లలో మతీషా పతిరానా సభ్యుడిగా ఉన్నాడు. కనీస ధర రూ.20 లక్షలతో మతీషా పతిరానా సీఎస్కే జట్టులో చేరనున్నాడు.
ఐపీఎల్-2022లో ఇప్పటివరకు భర్తీ చేసిన ఆటగాళ్ల జాబితా :
- గుజరాత్ టైటాన్స్ – జాసన్ రాయ్ స్థానంలో రహ్మానుల్లా గుర్బాజ్ జట్టులో చేరిక
- కోల్కతా నైట్ రైడర్స్ – అలెక్స్ హేల్స్ స్థానంలో ఆరోన్ ఫించ్ చేరిక
- లక్నో సూపర్ జెయింట్స్ – మార్క్ వుడ్ స్థానంలో ఆండ్రూ టై చేరిక
- రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు – లువ్నిత్ సిసోడియా స్థానంలో రజత్ పాటిదార్ చేరిక
- రాజస్థాన్ రాయల్స్ – నాథన్ కౌల్టర్ నైల్ జట్టుకు దూరంగా కాగా ఎలాంటి చేరిక లేదు
- కోల్కతా నైట్ రైడర్స్ – రసిక్ దార్ స్థానంలో హర్షిత్ రానా చేరిక
- చెన్నై సూపర్ కింగ్స్ – దీపక్ చాహర్ జట్టుకు దూరంగా కాగా ఎలాంటి చేరిక లేదు
- చెన్నై సూపర్ కింగ్స్ – ఆడమ్ మిల్నే స్థానంలో మతీషా పతిరానా చేరిక.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ