ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంగిట సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కొత్త కెప్టెన్గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఏడెన్ మార్క్రమ్ను నియమించింది. ఈ మేరకు ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా గురువారం అధికారికంగా ప్రకటించింది. కాగా ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ తరపున మార్క్రమ్ 12 ఇన్నింగ్స్లు ఆడి 139.05 స్ట్రైక్రేట్తో మూడు అర్ధసెంచరీలు సహా 381 పరుగులు చేశాడు. ఇక అంతకుముందు సీజన్లోనే డేవిడ్ వార్నర్ జట్టును వీడగా, ఈ సీజన్కు ముందు కేన్ విలియంసన్ను జట్టు వదులుకుంది. దీంతో ఈ సీజన్కు కెప్టెన్గా ఎవరు ఉండొచ్చనే అనుమానాలు అభిమానులలో మెదిలాయి. ఈ నేపథ్యంలో చివరకు యాజమాన్యం ఏడెన్ మార్క్రమ్కు జట్టు పగ్గాలు అప్పగించింది. కాగా ఇటీవలే దక్షిణాఫ్రికాలో ముగిసిన ఎస్ఏ టీ20 టోర్నీలో సన్రైజర్స్ యాజమాన్యానికి చెందిన అనుబంధ ఫ్రాంచైజీ సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టుకు మార్క్రమ్ సారధ్యం వహించాడు. దీంతో మరో ఆలోచన లేకుండా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ కూడా మార్క్రమ్కే అప్పగించింది.
THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram 🧡#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP
— SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE