భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మార్చ్ 5, 2020న చేపట్టదలచిన జీఐఎస్ఏటీ-1 ఉపగ్రహ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. సాంకేతిక కారణాల వలనే ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తునట్లుగా ఇస్రో తెలిపింది. మళ్లీ జీఐఎస్ఏటీ-1 ఉపగ్రహన్నీ ఎప్పుడు ప్రయోగించాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇస్రో ప్రకటించింది. జీఐఎస్ఏటీ-1, ఇస్రో ప్రయోగించనున్న అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం. 2,268 కేజీల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీయో స్టేషనరీ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ను ఇస్రో ఎంపిక చేసింది. జియో ఇమేజింగ్ ఉపగ్రహం అయినా జీఐఎస్ఏటీ-1 36,000 కిలోమీటర్ల పైభాగం నుండి భారత ఉపఖండాన్ని పర్యవేక్షిస్తూ, ఎర్త్ ఇమేజింగ్ చేపట్టడమే కాకుండా వ్యవసాయం, అటవీ, ఖనిజశాస్త్రం, విపత్తు హెచ్చరిక వంటి పలు విషయాల్లో కీలక సహకారం అందించనుంది.
The launch of GISAT-1 onboard GSLV-F10, planned for March 05, 2020, is postponed due to technical reasons. Revised launch date will be informed in due course.
— ISRO (@isro) March 4, 2020