భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆగస్టు 12, గురువారం ఉదయం 5.43 గంటలకు జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ)-ఎఫ్10 రాకెట్ ను నింగిలోకి పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎర్త్ ఆబ్సెర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-03) ను మోసుకెళ్తూ జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది. అయితే ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విఫలమైంది. “షెడ్యూల్ ప్రకారం జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగం ఈరోజు 05.43 గంటల వద్ద జరిగింది. మొదటి మరియు రెండవ దశల పనితీరు సాధారణంగానే జరిగింది. అయితే సాంకేతిక క్రమరాహిత్యం కారణంగా క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఇగ్నిషన్ జరగలేదు. దీంతో ఉద్దేశించిన విధంగా ఈ మిషన్ పూర్తి కాలేదు” అని ఇస్రో ప్రకటన చేసింది.
ముందుగా ఆగస్టు 11, బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ రాకెట్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. 26 గంటల కౌంట్డౌన్ అనంతరం రాకెట్ నింగిలోకి వెళ్లింది. ఈఓఎస్-03 శాటిలైట్ ద్వారా తుఫానులు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాలను త్వరగా పర్యవేక్షించడానికి వీలుంటుంది. అయితే మూడోది అయిన క్రయోజెనిక్ దశలో సమస్య తలెత్తడం కారణంగానే ఈ ప్రయోగం విఫలమైందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ