రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా శ్వేతా మహంతి స్థానంలో ఎల్.శర్మన్ నియమితులయ్యారు. స్టడీ లీవ్ నేపథ్యంలో శ్వేతా మహంతిని విధుల నుంచి రిలీవ్ చేశారు. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పనిచేస్తున్న ఎల్.శర్మన్ ను హైదరాబాద్ కలెక్టర్ గా నియమించారు. అదే విధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అదనపు బాధ్యతల నుంచి కూడా శ్వేతా మహంతిని రిలీవ్ చేస్తూ, మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ గా (స్థానిక సంస్థలు) విధులు నిర్వహిస్తున్న మనూ చౌదరికి నాగర్ కర్నూల్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ