జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్-2020 ఫలితాలు సోమవారం నాడు విడుదల అయ్యాయి. దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్-2020 పరీక్షను సెప్టెంబర్ 27 న ఢిల్లీ ఐఐటీ దేశవ్యాప్తంగా నిర్వహించింది. కరోనా మహమ్మారి పరిస్థితుల మధ్యలో కూడా దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఫలితాలను jeeadv.ac.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించి స్కోర్ కార్డులతో పాటుగా ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ ను కూడా ఢిల్లీ ఐఐటీ విడుదల చేసింది. ఈ ర్యాంకుల ఆధారంగా మొత్తం 23 ఐఐటీల్లో సుమారు 11,279 సీట్లను భర్తీ చేయనున్నారు. మరోవైపు జేఈఈ అడ్వాన్స్డ్-2020 కౌన్సెలింగ్ మరియు సీట్ల కేటాయింపు నమోదు ప్రక్రియ అక్టోబర్ 6 నుండి ప్రారంభం కానుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu