తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలోని ఇంగ్లీష్ సబ్జెక్టులో సిలబస్ మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర కొత్త ఇంగ్లీష్ పుస్తకాలను గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పలువురు విద్యా శాఖ, ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మాట్లాడుతూ, ఈ ఏడాది నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరంకు కొత్త సిలబస్తో ఇంగ్లీష్ పుస్తకాలను ముద్రించామని, ఈ కొత్త పుస్తకాలు త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అయితే ఇటీవల ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులకు పాత ఇంగ్లీష్ సిలబస్ ప్రకారమే పరీక్షల నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY