ఝార్ఖండ్ ప్రజలకు సీఎం సోరెన్ తీపి కబురు

Jharkhand Government Cuts Petrol Prices by Rs 25 For Two Wheelers, Mango News, Mango News Telugu, Jharkhand Government Petrol Prices, Jharkhand Government Decrease Petrol Prices Rate, Jharkhand govt cuts petrol price, Petrol price cut by massive ₹25 a litre in Jharkhand, jharkhand news, Jharkhand petrol prices, Jharkhand government slashes petrol price, Rs 25 per Litre for Petrol in Jharkhand, Jharkhand Petrol Prices, Jharkhand Petrol Rates

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగిన సంగ‌తి తెలిసిందే. పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు వంద దాటిపోవ‌డంతో వాహ‌న దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. పెట్రోల్ పై రూ. 5, డిజిల్ పై రూ. త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్రం త‌గ్గించిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కూడా పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాయి. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఓ తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.25 తగ్గించనున్నట్టు ప్రకటించారు. అయితే, ద్విచక్ర వాహనాల వారికే ఈ సౌకర్యం వర్తించనుంది. హేమంత్ సోరెన్ ఓ ట్వీట్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు.

”పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలపై దీని ప్రభావం ఎక్కువగా పడుతోంది. అందువల్లనే, రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులందరికీ కొంత ఉపశమనం కల్గించేందుకు, లీటర్ పై రూ.25 చొప్పున పెట్రోల్ ధరలు తగ్గించాలని నిర్ణయించాం. 2022 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి వస్తుంది” అని హేమంత్ సోరెన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు పెట్రోల్ ధ‌ర‌ల‌పై ప‌న్నులు పెంచారు. దీంతోపాటు, ఒపెక్ ప్లస్ దేశాలు ముడి చ‌మురు ఉత్ప‌త్తిని భారీగా త‌గ్గిస్తూ గ‌తంలో నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ధ‌ర‌లు పెరిగిపోయాయి. ఈ పరిస్థితులలో సీఎం హేమంత్ సోరెన్ తీసుకున్న నిర్ణ‌యాన్ని అక్క‌డి ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =