దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్ ప్రకటించాయి. 548 జిల్లాలతో కూడిన 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా అడుగులేశాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కొన్ని జిల్లాల్లో మాత్రమే లాక్డౌన్ ప్రకటించాయి. అలాగే లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంలో కూడా పాక్షికంగానే లాక్డౌన్ విధించారు. ఇక సిక్కిం, మిజోరాం రాష్ట్రాల్లో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, పదిమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు:
- అండమాన్&నికోబార్ – పూర్తిగా లాక్డౌన్
- ఆంధ్రప్రదేశ్ – పూర్తిగా లాక్డౌన్
- అరుణాచల్ ప్రదేశ్ – పూర్తిగా లాక్డౌన్
- అస్సాం – పూర్తిగా లాక్డౌన్
- బీహార్ – పూర్తిగా లాక్డౌన్
- ఛత్తీస్ ఘడ్ – పూర్తిగా లాక్డౌన్
- డామన్ డయ్యు&దాద్రా నగర్ హవేలీ – పూర్తిగా లాక్డౌన్
- ఢిల్లీ – పూర్తిగా లాక్డౌన్
- గోవా – పూర్తిగా లాక్డౌన్
- గుజరాత్ – పూర్తిగా లాక్డౌన్
- హర్యానా – పూర్తిగా లాక్డౌన్
- హిమాచల్ ప్రదేశ్ – పూర్తిగా లాక్డౌన్
- జమ్మూ & కాశ్మీర్ – పూర్తిగా లాక్డౌన్
- జార్ఖండ్ – పూర్తిగా లాక్డౌన్
- కర్ణాటక – పూర్తిగా లాక్డౌన్
- కేరళ – పూర్తిగా లాక్డౌన్
- లడఖ్- పూర్తిగా లాక్డౌన్
- లక్షద్వీప్ – పాక్షికంగా లాక్డౌన్
- మధ్యప్రదేశ్ – 37 జిల్లాలు
- మహారాష్ట్ర – పూర్తిగా లాక్డౌన్
- మణిపూర్ – పూర్తిగా లాక్డౌన్
- మేఘాలయ – పూర్తిగా లాక్డౌన్
- మిజోరాం – ఇంకా ప్రకటించలేదు
- నాగాలాండ్ – పూర్తిగా లాక్డౌన్
- ఒడిశా – 5 జిల్లాలు
- పుదుచ్చేరి- పూర్తిగా లాక్డౌన్
- పంజాబ్ – పూర్తిగా లాక్డౌన్
- రాజస్థాన్ – పూర్తిగా లాక్డౌన్
- సిక్కిం – ఇంకా ప్రకటించలేదు
- తమిళనాడు – పూర్తిగా లాక్డౌన్
- తెలంగాణ – పూర్తిగా లాక్డౌన్
- త్రిపుర – పూర్తిగా లాక్డౌన్
- ఉత్తర ప్రదేశ్ – 16 జిల్లాలు
- ఉత్తరాఖండ్ – పూర్తిగా లాక్డౌన్
- పశ్చిమ బెంగాల్ – పూర్తిగా లాక్డౌన్
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
కరోనా ఎఫెక్ట్ : లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా