తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రాష్టానికి సంబంధించి గతకొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి సహా మరికొంతమంది కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ రెండు, మూడ్రోజులపాటుగా ఢిల్లీలోనే ఉండే అవకాశముందని, తిరిగి ఆదివారం నాడు నగరానికి చేరుకోనున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో సీఎం వెంట పలువురు పార్టీ ఎంపీలు, ఉన్నతాధికారులు కూడా ఉండనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ