రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మే 10 నుండి మే 24 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్డౌన్ ను మరోసారి పొడిగిస్తునట్టు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. “కర్ణాటకలో లాక్డౌన్ జూన్ 7 వరకు పొడిగించబడుతుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్గదర్శకాలకు కట్టుబడి ప్రభుత్వంతో సహకరించాలని పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మహమ్మారిని ఓడించడానికి కలిసి పనిచేద్దాం” అని సీఎం యడియూరప్ప పేర్కొన్నారు.
అలాగే బ్లాక్ ఫంగస్ వ్యాధికి కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స ఇవ్వబడుతుందని చెప్పారు. కరోనా నుండి కోలుకున్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా రోగనిరోధకశక్తి లేని పరిస్థితులలో ఉన్నవారు, ఈ వ్యాధిని నివారించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం యడియూరప్ప కోరారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,67,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18,29,276 మంది కరోనా నుంచి కోలుకోగా, 24,207 మంది మరణించారు. ప్రస్తుతం 5,14,238 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ