కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దేశంలో రోజువారీగా అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 23,253 కరోనా కేసులు, 29 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 63,46,631 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 60,793 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 47,882 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 60,26,884 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 2,58,188 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 42332 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 36874, కొట్టాయంలో 27726, కొల్లంలో 24439, త్రిస్సుర్ లో 23947, మలప్పురంలో 16529, అలపుజాలో 16122, కోజికోడ్ లో 14758, ఇడుక్కిలో 13864, పాలక్కాడ్ లో 11418, పతనంతిట్టలో 9888, కన్నూర్ లో 9422 కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి కేరళలో 4,48,72,646 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ