తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 865 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 9, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,80,836 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 2,484 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,56,883 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.93 శాతంగా, మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,103 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,850 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 263, మేడ్చల్ మల్కాజ్గిరిలో 67, రంగారెడ్డిలో 60, ఖమ్మంలో 35, హనుమకొండలో 35, నల్గొండలో 33, కరీంనగర్ లో 28, పెద్దపల్లిలో 28, సంగారెడ్డిలో 27, భద్రాద్రి కొత్తగూడెంలో 25, సిద్దిపేటలో 25, జగిత్యాలలో 23, సూర్యాపేటలో 22 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ