కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 25,772 కరోనా కేసులు, 189 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,53,298 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 21,820 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 27,320 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 39,93,877 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 2,37,045 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కోజికోడ్ జిల్లాలో అత్యధికంగా 34161 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 34155, మలప్పురంలో 30416, త్రిస్సుర్ లో 22836, తిరువనంతపురంలో 16306, అలపుజాలో 14787 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి కేరళలో 3,26,70,564 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ