బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళవారం నాడు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ బీజేపీ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న నిర్మల్ పట్టణంలోని వెయ్యి ఊడల మర్రి దగ్గర బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నట్టు తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ రోజు పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొననున్నట్టు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ కీలక నేతలు, నాయకులు, కార్యకర్తలు ఈ సభలో పెద్దసంఖ్యలో పాల్గొననున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ