దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205 కోట్లకు చేరువైంది. ఆగస్టు 4, గురువారం ఉదయం 7 గంటల వరకు దేశంలో పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205 కోట్లు (2,05,22,51,408) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
అలాగే దేశవ్యాప్తంగా మార్చి 16 నుంచి 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు “కోర్బెవాక్స్” కోవిడ్-19 వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేటగిరి కింద ఇప్పటివరకు 3.92 కోట్లమందికిపైగా (3,92,26,460) మొదటి డోస్ వ్యాక్సిన్, 2,82,77,362 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ అందించినట్టు తెలిపారు. అదేవిధంగా జనవరి 3 నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్లకు “కోవాక్జిన్” కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించారు. 15-18 ఏళ్ల కేటగిరి కింద ఇప్పటివరకు 6,12,64,752 మందికి మొదటి డోసు, 5,12,28,469 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేసినట్టు వెల్లడించారు.
మరోవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా జూలై 15, 2022 నుండి వచ్చే 75 రోజుల వరకు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు 18-44 సంవత్సరాల వయస్సు వారు 2,76,24,044 మంది, 45-59 సంవత్సరాల వారు 1,80,61,558 మంది, 60 సంవత్సరాలు పైబడినవారు 3,35,44,947 మంది ప్రికాషన్ డోస్ తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY