కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,474 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,39,232 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 47,066 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 3,052 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 51,71,080 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 20,400 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులంలో జిల్లాలో అత్యధికంగా 3520 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 3414, కోజికోడ్ లో 2767, కొట్టాయంలో 2461, త్రిస్సుర్ లో 1727, మలప్పురంలో 1311, ఇడుక్కిలో 1119, కొల్లంలో 1024 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి కేరళలో 4,13,07,830 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ