దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 37,379 కేసులు, 124 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,49,60,261 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,82,017 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, జార్ఖండ్, కర్ణాటక, గుజరాత్, హర్యానా, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.
మరో 11,007 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,43,06,414 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.13 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.38 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 1,71,830 (0.49) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది. కాగా మొత్తం 1892 బాధితుల్లో ఇప్పటికే 766 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (జనవరి 3 (8am)–జనవరి 4 (8am)):
- మహారాష్ట్ర – 12,160
- వెస్ట్ బెంగాల్ – 6,078
- ఢిల్లీ – 4,099
- కేరళ – 2,560
- తమిళనాడు – 1,728
- జార్ఖండ్ – 1,481
- కర్ణాటక – 1,290
- గుజరాత్ – 1,259
- హర్యానా – 793
- ఛత్తీస్ ఘడ్ – 698
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ