కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 7,427 కరోనా కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,61,490కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 31,514 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 7,166 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 48,50,742 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 78,624 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 11955 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 10665, కోజికోడ్ లో 8294, కొల్లంలో 6842, కొట్టాయంలో 6108, త్రిస్సుర్ లో 5869, మలప్పురంలో 5233 కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి కేరళలో 3,78,21,220 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ