కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 25,010 కరోనా కేసులు, 177 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 43,34,704 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 22,303 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 23,535 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 40,74,200 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 2,37,643 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 35583 యాక్టీవ్ కేసులు ఉండగా, కోజికోడ్ లో 32341, మలప్పురంలో 29333, త్రిస్సుర్ లో 24837, తిరువనంతపురంలో 17224, అలపుజాలో 13832 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి కేరళలో 3,31,50,133 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ