దేశంలో డిసెంబర్ 19, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,04,599 కు, మరణాల సంఖ్య 1,45,136 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దేశంలో గత కొన్ని నెలలుగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నినిర్వహిస్తున్నారు. డిసెంబర్ 18 నాటికీ దేశవ్యాప్తంగా 16,00,90,514 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. రోజువారిగా పరీక్ష సామర్ధ్యం కూడా 11 లక్షలకు చేరుకుంది. ఇప్పటికి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 5 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 18,88,767
- కర్ణాటక – 9,07,123
- ఆంధ్రప్రదేశ్ – 8,78,285
- తమిళనాడు – 8,04,650
- కేరళ – 6,93,866
- ఢిల్లీ – 6,14,775
- ఉత్తర ప్రదేశ్ – 5,72,196
- పశ్చిమబెంగాల్ – 5,32,695
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ