భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. డిసెంబర్ 19, శనివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 25,152 కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1,00,04,599 చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 347 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,45,136 కి పెరిగింది. మరోవైపు ఇప్పటికే 95 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకేరోజులో 29,885 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 95,50,712 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 95.46 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ప్రస్తుతం 3,08,751 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వివరాలు:
- మహారాష్ట్ర – 18,88,767
- కర్ణాటక – 9,07,123
- ఆంధ్రప్రదేశ్ – 8,77,806
- తమిళనాడు – 8,04,650
- కేరళ – 6,93,866
- ఢిల్లీ – 6,14,775
- ఉత్తర ప్రదేశ్ – 5,72,196
- పశ్చిమబెంగాల్ – 5,32,695
- ఒడిశా – 3,25,505
- రాజస్థాన్ – 2,97,029
- తెలంగాణ – 2,80,195
- ఛత్తీస్ గడ్ – 2,64,898
- హర్యానా – 2,56,477
- బీహార్ – 2,45,933
- గుజరాత్ – 2,33,263
- మధ్యప్రదేశ్ – 2,29,130
- అస్సాం – 2,15,250
- పంజాబ్ – 1,62,270
- జమ్మూ కశ్మీర్ – 1,17,705
- జార్ఖండ్ – 1,12,606
- ఉత్తరాఖండ్ – 85,269
- హిమాచల్ ప్రదేశ్ – 51,625
- గోవా – 49,849
- పుదుచ్చేరి – 37,670
- త్రిపుర – 33,116
- మణిపూర్ – 27,540
- చండీఘర్ – 18,979
- అరుణాచల్ ప్రదేశ్ – 16,611
- మేఘాలయ – 13,189
- నాగాలాండ్ – 11,832
- లడఖ్ – 9,252
- సిక్కిం – 5,439
- అండమాన్ అండ్ నికోబర్ – 4,869
- మిజోరాం – 4,094
- దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు – 3,352
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ