కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా విధించిన లాక్డౌన్ 3.0 గడువు మే 17 వ తేదీతో ముగియడంతో, మళ్ళీ మే 31 వరకు పొడిగిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం లాక్డౌన్ 4.0 కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోమ్ శాఖ విడుదల చేసింది. కొత్తగా కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి నిచ్చారు. అయితే రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడుపుకునేందుకు, ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం ఉండాలని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
లాక్డౌన్ 4.0 లో అనుమతి లేనివి:
- దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, రైళ్లు, మెట్రో: అనుమతి లేదు
- బస్సు సర్వీసులు : కంటైన్మెంట్ జోన్స్ లో అనుమతి లేదు
- రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు బయటకు రావడం (కర్ఫ్యూ) : అనుమతి లేదు
- 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల పెద్దలు, పిల్లలు, పెగ్నెంట్స్ బయటికి రావడం: అనుమతి లేదు
- పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్ సెంటర్లు: అనుమతి లేదు
- హోటల్స్, రెస్టారెంట్స్, ఆతిద్యసేవలు : అనుమతి లేదు
- సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఇతర వినోద కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు: అనుమతి లేదు
- రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సమావేశాలు : అనుమతి లేదు
- సభలు, సామూహిక మత ప్రార్ధనలు: అనుమతి లేదు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]