కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ పరీక్షలను జూలై 1 వ నుంచి 15 తేదీ వరకు నిర్వహిస్తామని ఇటీవలే వెల్లడించారు. అలాగే మే 16, శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ పరీక్షల సంబంధించిన షెడ్యూల్ను కూడా వెల్లడిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ (హెఛ్ఆర్డీ) తెలిపింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల సీబీఎస్ఈ పరీక్షల డేట్షీట్ విడుదలను మే 18, సోమవారానికి వాయిదా వేశామని శనివారం సాయంత్రం మరో ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హెచ్చార్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ దృవీకరించారు.
మరోవైపు సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్షలు కేవలం నార్త్ ఈస్ట్ ఢిల్లీ జిల్లాలోనే వాయిదా పడ్డాయి. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో పదో తరగతికి సంబంధించిన 6 సబ్జెక్టుల పరీక్షలు, 12 వ తరగతికి చెందిన 11 సబ్జెక్టుల పరీక్షలు, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో 12 వ తరగతికి చెందిన 12 సబ్జెక్టుల పరీక్షలతో కలిపి మొత్తం 29 పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ http://www.cbse.nic.in/ లో అందుబాటులో ఉంచనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu